23.3.08
19.3.08
18.3.08
నాకు నచ్చిన పాట
ముత్యమల్లె మెరిసిపొయే మల్లె మొగ్గా..
ముట్టుకుంటే ముడుసుకుంటావ్ ఇంత సిగ్గా..
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే
ఊరూ నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే
కురిసే సన్నని వానా సలి సలిగా ఉన్నది లోనా
గుబులౌతుందే గుండెల్లొనా
జరగనా కొంచెం నేనడగనా లంచం
చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం
వెచ్చగ ఉందాము మనము..
హే పైటలాగా నన్ను నువ్వు కప్పుకొవే..
గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే ..
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే
పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేలా అది తొలకరించు వేళా
తెలుసుకో పిల్ల ఈ బిడియమేల మళ్ళ
ఉరికే పరువమిదీ మనదీ
హే కాపుకొస్తే కాయలన్ని రాలిపొవా
జాముకొస్తే కొర్కెల్లన్ని తీరిపోవా
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే
11.3.08
కవి
ఎక్కడో.. అందని దూరాన ఉన్న
అనంత ఆకాశంలోని ఒక చిన్న తార
ఆరుబయట మంచు దుప్పటి కప్పుకుని
పడుకుని ఉన్ననాకు కనిపించి
నాలో భావావేశం రగిలించి ఊహలకు ఊపిరినిచ్చి
ఆలోచలనకు అక్షర రూపం ఇచ్చింది
ఆ సమయాన నాలో
ఉత్సాహం ఉప్పెనలా ఉరికింది
కలం కృష్ణలా కదిలింది
అక్షరం లక్ష అక్షౌహిణులుగా మారింది
నిజంగా ఆ గగన దేశాన ఉన్న తార,
తారగాక ఏ కవివరేణ్యుడో స్వర్గలోకాలు చేరి
అక్కడ కూడా తన వెలుగు విరజిమ్ముతూ
ప్రకాశిస్తుంటాడు..
ఆ వెలుగే నాకు ఉత్ప్రేరకమై
ఆ తేజస్సే నాకు ఆశీస్సుగా మారి
నాలో ఉన్న చిన్న
హృదయాన్ని స్పందింప చేసింది.
7.3.08
27.2.08
భారతీయ ఆధ్యాత్మికతలో త్రికోణం ప్రాముఖ్యత.
మన భారతీయ సంప్రదాయంలో త్రికోణానికి ఒక ప్రత్యేకత ఉంది. త్రికోణం యొక్క మూడు గీతలూ సౄష్టి యొక్క మూడు స్థాయిలను సూచిస్తుంది. త్రికాలాలు (భూత, భవిష్యత్ మరియు వర్తమానాలు), త్రిగుణాలు (సత్వ, రజో, తమో), త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు), సౄష్టి,స్థితి, లయాలు; స్త్రీ, పురుష, నపుంసకత్వం; ప్రారంభం, గమనం, అంతం; జననం, జీవితం మరియు మరణం మొదలగునట్టి ఎన్నో భావాలు త్రికోణం వ్యక్తం చేస్తుంది. ప్రారంభం చివరలో అంతం అయిపోవడం జీవి జీవిత చక్ర పరిభ్రమణాన్ని సూచిస్తుంది.
త్రికోణాన్ని ప్రపంచాన్ని నడిపే మూల శక్తిగా ఆధ్యాత్మికతలో గుర్తిస్తారు, పూజిస్తారు. త్రికోణాన్ని యంత్రంగా కూడా అంగీకరిస్తారు. మనం ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు కూడా మన దేహం త్రికోణాన్నే పోలి ఉంటుంది.
26.2.08
తల్లి, తండ్రి మరియు గురువు.
మాతౄదేవో భవః, పితౄదేవో భవః, ఆచార్యదేవో భవః అన్నది మన ఆర్యోక్తి. ప్రతి మనిషి జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తులకీ అంత ప్రాముఖ్యత ఉంది. తల్లి, తండ్రి, గురువు ఈ వరసక్రమం గురించి ఒక చిన్న వివరణ. ప్రతి మనిషీ తన జీవిత ప్రస్థానంలో మొదట కలిసే వ్యక్తి తల్లి ఆ తరువాతే మిగతా అందరూ. తల్లి, తండ్రి, గురువు అని చెప్పడం వెనుక అర్ధం తల్లి తన బిడ్డకు తండ్రిని పరిచయం చేస్తే ఆ తండ్రి ఆ బిడ్డని ఒక శ్రేష్టమయిన గురువుకి అప్పచెబుతాడు, ఆ గురువు ద్వారా సమాజాన్ని తెలుసుకుని, జ్ఞానాన్ని సముపార్జన చేసి సంఘంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. అందుకే మాతా పితరులను, గురువును దైవంతో సమానంగా కొలవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
నిద్ర లేవగానే చేతులు ఎందుకు నేలకు ఆన్చాలి?
ఉదయాన నిద్ర లేవగానే కాసేపు అలానే పక్కలో కూర్చుని కాసేపు భగవంతుని ప్రార్థించి చేతులు నేలకు మొదట ఆన్చి తరువాత కాళ్ళు కింద పెట్టాలని మన పెద్దలు చెబుతూ మన పాదాలు నేలఫై పెట్టి భూమికి వత్తిడి కల్గిస్తాం కాబట్టి భూమాతను క్షమిమ్చమని పక్క దిగే ముందు ముందు చేతితో నేలను తాకాలని చెపుతారు. ఈ బోధన వెనుక ఉన్నశాస్త్రియత పరశిలిస్తే
నిద్రపోతున్న వారి శరీరంలో ప్రవహించే శక్తిని స్టాటిక్ ఎనర్జీ (Static Energy) అని లేదా పొటన్షియల్ ఎనర్జీ (Potential Energy) అని పిలుస్తారు, కానీ నిద్రమేల్కొని లేచి నిలబడినప్పుడు ఆ శక్తే డైనమిక్ ఎనర్జీ (Dynamic Energy) లేదా కెనెటిక్ ఎనర్జీ (Kinetic Energy) గా మారుతుంది. నిద్రపోతున్నప్పటి కెనటిక్ ఎనర్జీ స్వచ్ఛమైనది కాదు. కావున నిద్రమేల్కొని పక్కదిగే ముందు చేతితో భూమిని కాసేపు తాకడం వల్ల శరీరంలో ఉన్న అశుద్ధ శక్తి చేతిద్వారా బయటకు పోయి స్వచ్ఛమైన శక్తి శరీరంలోకి ప్రవహిస్తుంది. ఒకవేళ అలాకాక మొదట పాదాలనే భూమికి తాకించినట్లయితే శరీరంలోని శక్తి తరంగాలు క్రిందుగా ప్రవహించి శరీరాన్ని బలహీనపరుస్తుంది. అలాకాక మొదట చేతిని భూమిపై ఆనించి ఉంచిన ఒకే సమయంలో వ్యతిరేక శక్తి బయటకు వెళ్ళి అనుకూల శక్తి శరీరం నిండా నిండుతుంది. ఈ శాస్త్రీయతను దౄష్టిలో ఉంచుకునే మన పూర్వీకులు పడక దిగే ముందు చేతిని భూమికి తాకించి నమస్కరించమని చెప్పారు, ఆ విదంగా మనం జీవించడానికి చోటునిచిన భూమాతకు కూడా ప్రణామం చేసినట్లు కూడా అవుతుందని వారి భావన.
25.2.08
23.2.08
22.2.08
నీవు లేకుంటే
ప్రార్ధన
ఆటోగ్రాఫ్
20.2.08
శ్రీ సాయినాధుని దివ్య దర్శనం.
స్వామి వారి దివ్యదర్శనానికి క్రింది లింక్ వత్తాలి.
http://www.shrisaibabasansthan.org/shirdilivedarshan1.htm